స్పెషల్ స్టోరీ: కెనడా లో 'కూచిపూడి డాన్స్' వర్క్ షాప్
- September 03, 2017కెనడా: నృత్యాలయం, శ్రీమతి వేమూరి సుధా మరియు తెలుగువాహిని నడుపుతున్న కూచిపూడి డాన్స్ ఇన్స్టిట్యూట్ తెలుగువాహిని - టొరొంటో సాహిత్య సాంస్కృతిక సంస్థతో సంయుక్తంగా నృత్యవాహిని పేరిట 3 వారాలపాటు తక్కువ వ్యవధిలో ఎక్కువ శ్రద్ధతో కూచిపూడి నృత్యాన్ని నేర్పించారు. నృత్య శాఖ విభాగానికి చెందిన ప్రొఫెసర్ అరుణా భిక్షు, హెచ్ సి యు ద్వారా వర్క్ షాప్ నిర్వహించబడింది. నాట్యాన్ని ప్రాధమికస్థాయిలో నేర్చుకొంటున్నవారు కొత్తగా నాట్యాన్ని అభ్యసించేవారు పదహారుమంది పాల్గొన్నారు. ఈ బృందంలో తెలుగు మాట్లాడే కెనడియన్ పౌరులతో పాటుభిన్నమైన బెంగాలీలు, శ్రీలంక వంటి వరుసగా ఈ నాట్య ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రాథమికంగా వివిధ సాంస్కృతిక మరియు భాషా సమూహాలకు చెందిన కళాకారుణులు తెలుగు నృత్య రూపాన్ని అందించారు.మూడున్నర గంటల సేపు తమ విలువైన ప్రదర్శన ఇచ్చారు.సాంప్రదాయ యుగళగీతంతో సాంప్రదాయ కూచిపూడి సమ్మేళన ప్రదర్శనను 400 మందికి పైగా ప్రేక్షకుల నిలబడి ప్రదర్శనాకారులను అభినందించారు. సాయంత్రం గౌరవ అతిథులు దీపికా డమెర్ల (ఎంపీ ,కెనడా) మరియు దీనబాబు (బోర్డు సభ్యుడు, సిలికాన్ ఆంధ్ర) శ్రీమతి వేమూరి సుధా పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని శ్రీ మతి అరుణ భిక్షు తన గురువైన లేట్ ఏలేశ్వరపు సూర్యప్రకాశ శర్మకు అంకితం చేసారు.
తాజా వార్తలు
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ