టెక్సాస్ కు భారీ ఆర్ధిక సాయం ప్రకటించిన ట్రంప్
- September 03, 2017హార్వే తుఫాన్ సృష్టించిన బీభత్సం టెక్సాస్ను పూర్తిగా దెబ్బతీసింది. ఇప్పుడు ఆ అమెరికా రాష్ట్రానికి దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారీ నష్టపరిహారాన్ని అందించాలనుకుంటున్నారు. సహాయక చర్యల కోసం మొదటి దఫాగా సుమారు 50 వేల కోట్లు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అయితే అంత మొత్తం ఆర్థిక సాయం అందించాలంటే ముందుగా కాంగ్రెస్ అనుమతి పొందాల్సి ఉంటుంది. టెక్సాస్, లూసియానా రాష్ట్రాల వరద బాధితులకు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు. ఈ అకౌంట్ను రిలీజ్ చేసేందుకు కావాల్సిన చర్యలపై ట్రంప్ అమెరికా కాంగ్రెస్తో మాట్లాడినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ఒకసారి టెక్సాస్ వెళ్లిన ట్రంప్ మరోసారి ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. హరికేన్ హార్వే వల్ల సుమారు 47 మంది చనిపోయారు. 50 వేల మంది నిరాశ్రయులయ్యారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం..
- కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా కీలక బాధ్యతలు
- అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై తిలకం దిద్దిన సూర్య భగవానుడు
- భారీ వర్షాలు..ఎమిరేట్స్ ప్రయాణికులకు చెక్-ఇన్ నిలిపివేత
- ఒమన్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
- తూర్పు ప్రావిన్స్లో భారీ వర్షం.. రియాద్లో అలెర్ట్ జారీ
- భారీ వర్షాలతో విద్యుత్, ఇంటర్నెట్,మంచినీటి సమస్యలు..!
- దుబాయ్ లో మెట్రో సేవలకు అంతరాయం
- సాల్మియాలో ఇద్దరు ప్రవాసులు అరెస్ట్
- భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం..