ఒమన్, యూఏఈల్లో ఎలక్ట్రిక్ వాహనాల రోడ్ ట్రిప్
- October 23, 2017మస్కట్: జనవరి 18 నుంచి 26 వరకు యూఏఈ, ఒమన్లలో ఎలక్ట్రానిక్ వెహికిల్స్ రోడ్ ట్రిప్ నిర్వహించనుంది. ఈ వాహనాల పట్ల అందరిలోనూ చైతన్యం తెచ్చేందుకు ఈ రోడ్ ట్రిప్ని నిర్వహించనున్నారు. అబుదాబీలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ రోడ్ ట్రిప్ జనవరి 18న అబుదాబీలోని వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ నుంచి ప్రారంభమవుతుంది. తొమ్మిఇ రోజులపాటు ఒమన్ మరియు యూఏఈలలో జరిగే ఈ ట్రిప్ చాలా ప్రత్యేకమైనదని నిర్వాహకులు అంటున్నారు. అల్ అయిన్ వద్ద ఒమన్లో ఈ ర్యాలీ ప్రవేశించి, ఇబ్రి ద్వారా మస్కట్ చేరుకుంటుంది. ఖతమత్ మలాహా బోర్డర్ ద్వారా దేశం నుంచి బయటకు వెళుతుంది. ఫుజారియా, రస్ అల్ ఖైమా ద్వారా ప్రయాణించి దుబాయ్లో ఈ రోడ్ ట్రిప్ ముగుస్తుంది. తొమ్మిదిరోజులపాటు సాగే ఈ అడ్వెంచర్ ట్రిప్లో పాల్గొనేందుకు ఔత్సాహికులు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..