ఉల్లంఘనలకు పాల్పడిన కార్లను స్వాధీనం చేసుకోవడంలో విఫలమైన అధికారులు సస్పెండ్
- November 17, 2017కువైట్ : నిబంధనలు అమలులోకి వచ్చిన తరవాత ఉల్లంఘనలకు పాల్పడినవారిని ఊపేక్షించిన కొందరు అధికారులను జనరల్ ట్రాఫిక్ డిపార్టుమెంటు (జిటిడి) సస్పెండ్ చేయనుంది. వాహనాల డ్రైవర్లు సీట్ బెల్ట్లను ధరించకుండా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, డ్రైవర్ మొబైల్ ఫోన్ ను ఉపయోగిస్తున్నట్లయితే, వాహనాలను స్వాధీనం చేయకపోవచ్చని స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఈ నిబంధన అమలులోనికి వచ్చిన 24 గంటల తర్వాత సరిగా చర్యలు తీసుకొని అధికారులను సస్పెండ్ చేశారు. నివేదిక ప్రకారం, మొదటి 24 గంటల్లో పౌరులకు మరియు నివాసితులు చెందిన 1,000 కి పైగా కార్లను స్వాధీనం చేసుకున్నారు. కొందరు పార్లమెంట్ సభ్యులతో సహా పెద్ద సంఖ్యలో పైన పేర్కొన్న ఉల్లంఘనలకు పాల్పడిన కార్లను చేజిక్కించుకోవడానికి అధికారులు అంతగా ఉత్సాహాన్ని చూపకుండా నిర్లక్ష్యంతో వదిలివేస్తున్నట్లు గుర్తించింది.కొందరు అధికారులకు ఈ నిబంధనల పట్ల అంతగా ఆసక్తి లేదు తెలుస్తోంది. అయితే మరికొందరు అధికారులు ఖచ్చితమైన విధానాలు అమలుచేయడంతో అనేక మంది పౌరులు,p ప్రవాసీయులు కారులను అద్దెకి ఇచ్చే కార్యాలయాల చుట్టూ మొదటి రోజున ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..