భారత్ లో పాగాకు ఐసిస్ యత్నం, గల్ఫ్ నుంచి భారీగా నిధులు
- November 17, 2017న్యూఢిల్లీ: గల్ఫ్ దేశాల్లో క్రమంగా ప్రాబల్యం తగ్గిపోవడంతో... ఇప్పుడు ఉగ్రవాద సంస్థ ఐసిస్ కన్ను మన దేశంపై పడింది. ప్రపంచంలోని పలు దేశాల్లో నెత్తుటి ఏర్లు పారించిన ఐసిస్... ఇప్పుడు భారత్ లో పాగా వేసేందుకు యత్నిస్తోంది.
ముఖ్యంగా ఈ ఉగ్రవాద సంస్థ మనదేశంలోని కేరళను టార్గెట్ చేస్తోంది. కేరళ నుంచి వెళ్లి ఐసిస్ లో చేరుతున్నవారికి పెద్ద ఎత్తున నిధులను సమకూరుస్తూ.. భారత్ లో భారీ విధ్వంసానికి ప్రణాళికలు రచిస్తోంది.
ఈ క్రమంలో భారత్ కు నిధులను తరలించేందుకు ఈ ఉగ్రవాద సంస్థ హవాలా మార్గాలను ఎంచుకుంది. అయితే భారత్ లో భారీ విధ్వంసానికి ఐసిస్ నిధులను సమకూరుస్తోందన్న ఇంటెలిజెన్స్ రిపోర్టుతో రంగంలోకి దిగిన కేరళ పోలీసులు.. ఐసిస్ ప్రణాళికలను భగ్నం చేశారు.
ఐసిస్ సానుభూతిపరులపై మెరుపుదాడులు జరిపి వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో గల్ఫ్ దేశాల నుంచి హవాలా రూపంలో తస్లీం అనే వ్యక్తికి డబ్బు వస్తోందని, అతడి వద్ద నుంచి ఐసిస్ సానుభూతిపరులకు పంపిణీ అవుతోందని పోలీసులు గుర్తించారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?