భూమికా చావ్లా రీ ఎంట్రీకి రెడీ
- November 18, 2015ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న భూమికా చావ్లా తరువాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉంటోంది. గ్లామర్ క్యారెక్టర్స్ తో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కూడా ఆకట్టుకున్న ఈ భామ ప్రస్తుతం రీ ఎంట్రీకి రెడీ అవుతోంది. తెలుగుతో పాటు హిందీలోనూ విజయవంతమైన చిత్రాల్లోనటించిన భూమిక బాలీవుడ్ సినిమాతోనే రీ ఎంట్రీకి రెడీ అవుతోంది. విజయవంతమైన భారత క్రికెట్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న మహేంద్రసింగ్ ధోని జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో భూమిక మరోసారి వెండితెరమీద దర్శనమివ్వనుంది. కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటిస్తుండటంతో సినిమాలో భూమిక పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందంటున్నారు చిత్రయూనిట్. బాలీవుడ్ లో తేరేనామ్, గాంధీ మై ఫాదర్, రన్ లాంటి సినిమాల్లో నటించిన భూమిక నార్త్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు. ప్రస్తుతానికి బాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తున్నభూమిక సరైన క్యారెక్టర్ దొరికితే సౌత్ లో కూడా ఎంట్రీకి రెడీ అంటోంది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..