దింగాలేశ్వర శాఖ మఠం మహాలింగ స్వామీజీ ఆత్మహత్య
- January 12, 2018సంసార బంధాలనుంచి విముక్తి కోసం సన్యాసం స్వీకరిస్తే అక్కడ కూడా మనశ్శాంతి కరవాయే. ఏమి సేతుర లింగా అంటూ కర్ణాటకకు చెందిన ఓ స్వామీజీ ఆత్మహత్య చేసుకున్నారు. కర్ణాటకలోని హుళ్లత్తి గ్రామ దింగాలేశ్వర శాఖ మఠం మహాలింగ స్వామీజీ (38) ఆత్మహత్య చేసుకున్నారు. గదం జిల్లా శిరహట్టి తాలూకాలోని బాలేహోసూర్కి చెందిన దింగాలేశ్వర మఠంలో ఉండేవారు. ఆదివారం అర్థరాత్రి మఠంలో ఎవరూ లేని సమయం చూసి డెత్ నోట్ రాసి సూసైడ్ చేసుకున్నారు. మరుసటి ఉదయం మఠానికి వచ్చిన భక్తులు స్వామీజీ అచేతనంగా పడి ఉండడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి డెత్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. తన మరణానికి ఎవరూ కారణం కాదని, గత కొంత కాలంగా మనశ్శాంతి లేదని అందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. తన దేహానికి మఠంలోనే అంత్యక్రియలు నిర్వహించాలనే కోరికను వెల్లడించారు స్వామీజీ సూసైడ్ నోట్లో.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్