మాల్దీవుల్లో ఇద్దరు జర్నలిస్టుల అరెస్టు ఒకతను భారతీయదు ,ఇంకొకరు బ్రిటిష్ జాతీయుడు
- February 10, 2018మాలే: అత్యవసర పరిస్థితి అమలవుతున్న నేపథ్యంలో దేశ భద్రత పేరు చెప్పి మాల్డీవుల్లో ఇద్దరు జర్నలిస్టులను అరెస్టు చేశారు. వారిలో ఒకతను భారతీ యుడు కాగా, మరొక తను భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడు. పంజాబ్కు చెందిన మణిశర్మ, లండన్కు చెందిన అతీష్ రావ్జీ పటేల్ 'ఏఎఫ్పి' న్యూస్ ఏజెన్సీకి రిపోర్టర్లుగా పని చేస్తున్నారు. జర్నలిస్టుల అరెస్టుపై జాయింట్ అపోజిషన్ అధికార ప్రతి నిధి అహ్మద్ మహ్లూఫ్ స్పందించారు.మాల్దీవుల్లో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలిసిపోతుందని ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. ఇక్కడ ఎంత మాత్రమూ పత్రికా స్వేచ్ఛ లేదని, గత రాత్రి ప్రముఖ టీవీ స్టేషన్లను మూసేశారని అధాలత్ పార్టీ డిప్యూటీ లీడర్ అలీ జహీర్ అ న్నారు. మాల్దీవుల్లో ఇద్దరు విదేశీ జర్నలిస్టులను అరెస్టు చేశారని, వారి లో ఒకతను భారతీయుడు కాగా, మరొకతను బ్రిటిష్ అని, వారు ఎఎఫ్పి ఉద్యోగులని విదేశీ వ్యవహారాల మాజీ మంత్రి అబ్దుల్లా షాహిద్ అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
- చెస్ రారాజుకు నగదు పురస్కారం…
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల