సౌదీ అరేబియా జనాద్రీయ సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొన్న ఏ.పి వాసులు
- February 18, 2018
సౌదీ అరేబియా:సౌదీ అరేబియా రాజధాని రియాధ్లో సౌదీ ప్రభుత్వం నిర్వహిస్తున్న జనాద్రీయ సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా భారతీయ ఎంబసీ ఆధ్వర్యంలో శనివారం ఆంధ్రప్రదేశ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రియాధ్లోని ఏపీ ఎన్నార్టీ కో-ఆర్డినేటర్ అంథోని ఆంధ్రప్రదేశ్ స్టాల్ను ఏర్పాటు చేసి రాష్ట్రంలో పెట్టుబడి, పర్యాటక రంగంలో ఉన్న అవకాశాల గురించి సందర్శకులకు వివరించారు. సౌదీ అరేబియా రాజు సల్మాన్ గతవారం ప్రారంభించిన జనాద్రీయ ఉత్సవాలకు కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్ కూడా ప్రత్యేకంగా హాజరైన సంగతి తెలిసిందే. భారత్కు కేటాయించిన ప్రత్యేక స్థలంలో శనివారం ఆంధ్రప్రదేశ్ దినోత్సవాన్ని నిర్వహించారు. భారతీయ రాయబారి అహ్మద్ జావెద్ ఇతర సీనియర్ దౌత్యవేత్తలు, సౌదీ అరేబియా అధికారులు, ఆంధ్రపదేశ్ వేదికను సందర్శించి రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ఆసక్తిగా అడిగి తెలుసుకొన్నారు.ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన తరుణ్,వర్మ,సుమన్,సత్యం,విజయ ఆంథోనీకి మరియు క్లాసికల్ డాన్సర్స్ నమ్రత,రిత్విక,అశోక్ కు అంథోని ధన్యవాదాలు తెలియజేసారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..