నీట మునిగి ఐదేళ్ళ చిన్నారి మృతి

- March 21, 2018 , by Maagulf
నీట మునిగి ఐదేళ్ళ చిన్నారి మృతి

మనామా: మూసివేసిన ఓ స్విమ్మింగ్‌ పూల్‌ ఐదేళ్ళ చిన్నారిని బలిగొంది. దర్‌ కులైబ్‌ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన స్నేహితులతో కలిసి రౌండెబౌట్‌ 22 దగ్గరలో గల హమాద్‌ టౌన్‌ స్విమ్మింగ్‌ పూల్‌ దగ్గరకి మృతుడితోపాటు ఇంకొందరు చిన్నారులు వెళ్ళారు. రెసిడెంట్స్‌ చెబుతున్న వివరాల ప్రకారం స్విమ్మింగ్‌ పూల్‌లో సగం నీరు మాత్రమే వుంది. ల్యాండ్‌ లార్డ్‌కీ రెంటరర్‌కీ మధ్య లీగల్‌ డిస్ప్యూట్‌ కారణంగా ఈ స్విమ్మింగ్‌ పూల్‌ సరైన నిర్వహణలో లేదు. స్విమ్మింగ్‌ పూల్‌లో మునిగిపోయిన చిన్నారిని గుర్తించి వెంటనే బయటకు తీసి ఆసుపత్రికి తరలించినా, ప్రయోజనం లేకుండా ఓయింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. మృతుడికి దర్‌ కులైబ్‌ గ్రేవ్‌యార్డ్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com