వేసవి కాలంలో ఒంటిలోని వేడిని తగ్గించే ఒకే ఒక్క పండు..?
- April 13, 2018కర్భూజ పండు. ఈ పండును ఇంగ్లీష్లో మస్క్ మిలన్ అంటారు. ఈ కాలంలో కర్భూజ పండు ఎక్కువగా లభిస్తుంది. ఈ పండులో పోషకాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు. ఇందులో పొటాషియం, కాల్షియం, విటమిన్ - సి, విటమిన్ - ఎ, ఫ్లోరిక్ ఆమ్లాలు, ఫైబర్ వంటి పోషకాలు ఉన్న ఈ పండును తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి బోలెడు లాభాలు ఉన్నాయంటున్నారు.
ఎండాకాలంలో లభించే ఈ పండును తింటే శరీర వేడిని తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒంటికి చలువ చేస్తుంది. ఇందులో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. అలాగే పోషకాలు, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల అధిక బరువు ఉన్న వారు ఈ పండును తింటే మంచి ఫలితం ఉంటుందట.
కర్భూజ పండును తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలను నివారిస్తుంది. అజీర్తి, ఎసిడిటీ, మలబద్దకం, ఆకలి అనిపించకపోవడం వంటి సమస్యలు తొలగిపోతాయి. ఈ పండు శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు ఎముకలకు కావాల్సినన్ని పోషకాలకు అందించి ఎముకలను బలంగా మారుస్తుంది. ఇందులోని విటమిన్-సి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఎండాకాలంలో త్వరగా అలసిపోవడం, నీరసంగా ఉండడం వంటివి జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఈ పండును తీసుకుంటే తొందరగా రికవరీ అవుతుంది. అలాగే కళ్ళకు కూడా బాగా సహాయపడుతుంది.
తాజా వార్తలు
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?