మరో వారసుడు గల్లా అశోక్ ఎంట్రీకి రంగం సిద్ధం
- April 18, 2018
టాలీవుడ్లో వారసుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఎందరో వారసులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వగా, ఇప్పుడు మహేష్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే సమయం ఆసన్నమైందని చెబుతున్నారు. ప్రస్తుతం అశోక్ అమెరికాలోని ఓ ఇన్స్టిట్యూట్లో నటనకి సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. మేలో ఈ కుర్రాడి సినిమా లాంఛనంగా ప్రారంభం కానుండగా, ఈ మూవీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మాణంలో రూపొందనున్నట్టు తెలుస్తుంది. ఎస్.ఎస్ రాజమౌళి వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన కృష్ణారెడ్డి గండదాసు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారట. మహేశ్ బావ సుధీర్ బాబు ప్రధాన పాత్రలో 'ఆడు మగాడ్రా బుజ్జి' అనే సినిమాను తెరకెక్కించారు కృష్ణారెడ్డి . అయితే అశోక్ చిత్రం శ్రీలంకలోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకోనున్నట్టు తెలుస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని టాలీవుడ్ వెండితెరపై మరో సూపర్ స్టార్గా ఎదిగారు మహేష్ బాబు. ఆయన తనయుడు గౌతమ్ కూడా 1 నేనొక్కడినే చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. ఇక మహేష్ ఫ్యామిలీ నుండి సుధీర్ బాబు, మంజుల, ఆమె కూతురు జాన్వీ కూడా వెండితెరపై మెరిసారు. అయితే ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న అశోక్ తెలుగు ప్రేక్షకులని ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాలి.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







