మాట్లాతుంటే నోరు వాసన వస్తోందా...?
- April 20, 2018కొంతమంది మాట్లాడుతున్న, నవ్వుతున్నా నోరు వాసన వస్తుంది. నోరు దుర్వాసన రావడానికి పళ్లు సరిగా బ్రెష్ చేసుకోకపోవడం, చిగుళ్ల సమస్యలతో బాధపడటం, పళ్లపై గారలు ఏర్పడి ఎన్నిసార్లు శుభ్ర పరచుకున్నా పోకపోవడం లాంటి అనేక కారణాలు ఉంటాయి. చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలన్నా, పళ్లు తెల్లగా ఉండి నోటి నుండి దుర్వాసన రాకుండా ఉండాలన్నా వంటింట్లో ఉండే ఉప్పు చాలా ఉపయోగపడుతుంది.
పళ్లను శుభ్రపరచుకోవడానికి ఉప్పును ఈక్రింది విధంగా వాడవచ్చు....
1. కొంచెం ఉప్పు తీసుకొని దానిలో నీరు పోసి పేస్టులా చేసుకొని, బ్రష్తో పళ్లు తోముకుంటే తెల్లగా మెరుస్తూ ఉంటాయి. ఉప్పు నోటిలో ఉండే బ్యాక్టిరియాను చంపుతుంది. చిగుళ్లు, పళ్లు ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతుంది.
2. రోజూ ఉదయం పళ్లు శుభ్రపరచుకున్న తర్వాత గోరువెచ్చని నోటిలో కొంచెం ఉప్పు వేసి పుక్కిలించాలి. ఆతర్వాత తిరిగి నోటిని మంచి నీటితో శుభ్రపరచాలి. ఈవిధంగా రోజు చేస్తే నోటి దుర్వాసన తగ్గుతుంది.
3. కొంచెం మిరియాల పొడి, పసుపు, ఉప్పు కలిపి దాంట్లో కొంచెం నువ్వుల నూనె వేసి పేస్టులా చేసి దాంతో చిగుళ్లను రుద్దితే చిగుళ్ల వ్యాధులు తగ్గుతాయి. అంతేకాకుండా మనం వాడుకునే పేస్టుపై కొంచెం ఉప్పు వేసి తోముకుంటే పళ్లు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
4. నిమ్మతొక్కలను పొడి చేసి దాంట్లో ఉప్పు కలిపి ఒక సీసాలో పోసుకొని రోజూ కొంచెం పొడి తీసుకొని దాంట్లో కొంచెం నీళ్లు కలిపి పేస్టులా చేసి పళ్లు తోముకుంటే అందంగా మెరుస్తూ ఉంటాయి.
5. బ్రెడ్ను కాల్చి పొడి చేసి దాంట్లో తేనె కొంచెం ఉప్పు కలిపి పళ్లను రుద్దితే పళ్లపై గార పోతుంది.
6. నోటి దుర్వాసనతో బాధ పడేవారు ఉప్పు, బేకింగ్ సోడా సమపాళ్లల్లో కలిపి పళ్లపొడిలా తయారుచేసుకొని రోజు పళ్లు తోముకుంటుంటే నోటి దుర్వాసన తగ్గిపోతుంది.
తాజా వార్తలు
- భారత దేశ వ్యాప్తంగా నాల్గో విడత పోలింగ్కు సర్వంసిద్ధం..
- పోలింగ్కు పటిష్ట బందోబస్తు: సీపీ తరుణ్ జోషి
- రూ.4వేల ఆసరా పెన్షన్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన
- జార్జియా: ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన 50 వేల మంది
- అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- సౌదీలో BON TUM మయోనైజ్ పై నిషేధం
- రస్ అల్ ఖైమాలో గాయపడ్డ వ్యక్తి ఎయిర్లిఫ్ట్
- మే14 వరకు ‘మ్యాంగో మానియా’ మహోత్సవం
- విదేశీయుల నియామకం..రెస్టారెంట్ యజమానికి భారీ ఫైన్
- ఒమన్ను సందర్శించిన ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్తలు