దుబాయ్:మర్డర్ మిస్టరీ: 24 గంటల్లో ఛేదన
- April 20, 2018దుబాయ్:ఇథియోపియన్ మహిళ హత్య కేసులో నిందితుడ్ని ఇరవై నాలుగ్గంటల్లోనే దుబాయ్ పోలీస్ అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. దుబాయ్ పోలీస్, క్రిమినల్ ఎఫైర్స్ అసిస్టెంట్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ ఖలీల్ ఇబ్రహీమ్ అల్ మన్సౌరీ మాట్లాడుతూ, ఆఫ్రికాకి చెందిన ఓ మహిళ చనిపోయిన విషయమై తమకు సమాచారం అందిందనీ, బరాహా ఏరియాలోని ఓ అపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగిందనీ, సంఘటనా స్థలానికి వెంటనే పోలీస్ చేరుకున్నాయని తెలిపారు. అక్కడికి వెళ్ళిన పోలీసులకు డికంపోజ్ స్థితిలో వున్న మహిళ మృతదేహం కన్పించింది. బాధితురాల్ని గుర్తించిన పోలీసులకు, ఆమెతో ఓ పాకిస్తానీకి సంబంధం వున్నట్లు నిర్ధారణ అయ్యింది. విచారణలో భాగంగా నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతనితో నిజం చెప్పించారు. ఆమెతో శృంగారంలో రెండుసార్లు పాల్గొని 200 దిర్హామ్లు చెల్లించాననీ, ఇంకాస్త సమయం వుండి, మరింత సొమ్ము చెల్లించాల్సిందిగా ఆ మహిళ డిమాండ్ చేయడంతో, ఆమెను చంపేసి, ఆమె దగ్గరున్న డబ్బుని దొంగిలించి, మొబైల్ ఫోన్లనూ తీసుకుని పారిపోయినట్లు ఒప్పుకున్నాడు నిందితుడు. నిందితుడ్ని తదుపరి విచారణ నిమిత్తం జ్యుడీషియల్ అథారిటీస్కి అప్పగించారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..