ఆ అజ్ఞాతవాసి పేరు బయట పెట్టిన పవన్ కళ్యాన్!
- April 21, 2018ఈ విషయాన్ని తాను కూడా లీగల్ గానే వెళ్తానని..చెబుతున్నారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్. కాగా, నిన్న ఫిలిమ్ ఛాంబర్ లో మూడు టివి ఛానల్స్ పై నిప్పులు చెరిగిన పవన్ మరికొంత మంది పేర్లు కూడా బయట పెడతానని అన్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఆరోపణలు చేసిన శ్రీని రాజు(శ్రీసిటీ ఓనర్) అతడికి లీగల్ నోటీసులను పంపారు. దానికి సంబంధించిన కాపీలను సోషల్ మీడియాలో షేర్ చేసిన పవన్.. మీ బెదిరింపులకు బెదిరిపోనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా..'' శ్రీని రాజు మీరు పంపిన నోటీసులు నన్నేం మార్చలేవు.
రియల్ అఙ్ఞాతవాసి రవి ప్రకాశ్ చొరవతో మా తల్లిపై జరిగిన అవమానాన్ని మీరు పదే పదే చూపించారు. మీ సీఈవో, అలాగే అతడిని ప్రభావితం చేసిన రాజకీయనాయకులు అందరిపై న్యాయపోరాటం చేస్తా. గుడ్లుక్ శ్రీని'' అని కామెంట్ పెట్టారు.. శ్రీ సిటీలో వాటాల కోసం రాజకీయ బాసులతో కుమ్మక్కైన రవి ప్రకాశ్ ఈ చర్యకు ఒడిగట్టాడని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిందంతా చేసి ఇప్పుడు తనకు లీగల్ నోటీసులు పంపించడమేంటని శ్రీనిరాజుని ప్రశ్నించారు. శ్రీనిరాజు తనకు పంపిన లీగల్ నోటీసుల ప్రతిని పవన్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..