సౌదీ అధికారిక భవనం వద్ద పేలుడు
- April 21, 2018ఇస్తాంబుల్ : సౌదీ అరేబియా అధికార నివాసం వద్ద శనివారం సాయంత్రం పేలుడు జరిగిందని సోషల్మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే దీనిపై వివరణనిచ్చిన అధికారులు వారి అనుమతి లేకుండా అధికారిక నివాసం వద్ద డ్రోన్ను ప్రయోగిస్తున్నారని భద్రతా దళాలు కాల్పులు జరిపినట్లు తెలిపారు. భద్రతా దళాలు రియాద్కు సమీపంలో సౌదీరాజు సల్మాన్ అధికారిక భవనమైన అల్- ఖజోమా వద్ద ఒక డ్రోన్ను గుర్తించినట్లు పేర్కొన్నారు. దీంతో భద్రతా దళాలు దానిని పేల్చివేశాయని తెలిపారు. అయితే ఇది రిమోట్ కంట్రోల్తో పనిచేసే ఒక బొమ్మ విమానం అని తెలియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే యెమెన్ నుండి తరచుగా వచ్చే దాడుల నేపథ్యంలో సౌదీ భద్రతా దళాలు గట్టి భద్రతలు చేపట్టాయని పేర్కొన్నారు. ఈ పేలుడు జరిగిన సమయంలో సౌదీరాజు సల్మాన్ అధికారిక భవనంలో లేరని సౌదీ అధికారిక ప్రతినిధులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్