80 మంది ఆర్టిస్టులతో.. 'ఊపెకుహ'..
- April 24, 2018
80 మంది ఆర్టిస్టులు, 105 మంది టెక్నిషియన్స్ తో 60 రోజులు ఓ పండగ వాతావరణంలో తెరకెక్కిన నవ్వుల నజరానా మా 'ఊ. పె. కు. హ.'. ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఊ. పె. కు. హ. నవ్వుల పండగలో పని చేసినందుకు ఎంతో ఆనందంగా వుంది అంటున్నారు ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పి. ఆర్. నాగరాజు.
ఆయన మాట్లాడుతూ.. 'ఎన్నో చిత్రాలకు కో డైరెక్టర్ గా వర్క్ చేస్తూ ఊ. పె. కు. హ. చిత్రానికి ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా భాద్యతలు నిర్వహించడం ఆనందంగా వుంది. సాధారణంగా ప్రతి చిత్రంలో కామెడీ ఓ భాగంగా ఉంటుంది. కానీ నిధి ప్రసాద్ దర్శకత్వం వహించిన ఊ. పె. కు. హ. లో సినిమా మొత్తం కామెడీయే. 80 మంది ఆర్టిస్టులు నటించిన ఈ చిత్రంలో వారందించిన సహకారం మరువలేనిది. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ గారు తన చిత్రంగా భావించి, నటించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఉపేకుహ చిత్రంలో చాలా మంది ఆర్టిస్టులను చాలా చక్కగా హ్యాండిల్ చేసిన మా కెమెరామెన్ వాసు పనితనం చాలా గొప్పది. రాత్రి సందర్భాల్లో కూడా ఎవ్వరూ అలసట చెందకుండా, ముఖ్యంగా కేరళలోని కొచ్చిన్ పరిసర ప్రాంతాల్లో 45 మంది ఆర్టిస్టులతో చేసిన సీన్స్ గాని, సాంగ్స్ పరంగా గానీ వీరందరూ అందించిన సహకారం మరువలేనిది. ముఖ్యంగా అత్తాపూర్ లో 105 మంది టెక్నిషియన్స్, 80 మంది ఆర్టిస్టులు, 200 మంది జూనియర్ ఆర్టిస్టులతో చేసిన క్లైమాక్స్ ఈ చిత్రానికి హైలైట్.
అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఈ చిత్రానికి మరో హైలైట్. తాను బిజీగా ఉండి కూడా అత్యద్భుతమైన ఆర్ ఆర్ లతో పాటు ఆణిముత్యాల వంటి ఐదు పాటలను అందించారు. చాలా మంది ఆర్టిస్టులు వున్నా.. ఏ మాత్రం విసుగు చెందకుండా ఎంతో ఓర్పుతో ఎడిటింగ్ చేసిన ఎడిటర్ శంకర్ గారి కృషి మరువలేనిది. అలాగే సాంకేతిక నిపుణులు అందరూ ఎంతగానో సహకరించారు. ఏప్రిల్ 27 న ఊ. పె. కు. హ. సందడి మొదలవుతుంది. ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా అవుతుంది' అని అన్నారు.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







