అబుదాబీ:22 మంది డ్రగ్ పెడ్లర్స్ అరెస్ట్
- April 24, 2018
అబుదాబీ:అబుదాబీలో 22 మంది ఆసియా జాతీయుల్ని డ్రగ్స్ పెడ్లింగ్ కేసులో అత్యంత చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 20 కిలోల నార్కోటిక్స్ని స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్, క్రిస్టల్ డ్రగ్స్ వారి వద్ద లభించినట్లు అధికారులు తెలిపారు. ఈ డ్రగ్స్ రాకెట్కి సంబంధించిన సూత్రధారిని కూడా గుర్తించారు. ఆసియాకి చెందినవారిగా నిందితుల్ని పేర్కొన్నారు అధికారులు. డైరెక్టరేట్ ఆఫ్ డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ కల్నల్ తాహెర్ ఘరీబ్ అల్ దహెరి మాట్లాడుతూ, సీక్రెట్ ఆపరేషన్ ద్వారా నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. గ్రూపులుగా విడిపోయి, డ్రగ్స్ని విక్రయిస్తున్నట్లు గుర్తించి, పక్కా ప్లాన్తో వారిని అరెస్ట్ చేశామన్నారు. డ్రగ్స్ పట్ల అవగాహనా కార్యక్రమాల్ని మరింత విస్తృతంగా చేపట్టాల్సి వుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







