వీలైనంత త్వరగా నిరుద్యోగ భృతి అమలు: మంత్రి కొల్లు
- May 03, 2018అమరావతి: నిరుద్యోగ భృతిని వీలైనంత త్వరలు అమలు చేయాలని సీఎం యోచిస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గురువారం నిరుద్యోగ భృతిపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. అనంతరం మంత్రి కొల్లురవీంద్ర మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగ భృతిపై విధివిధానాలు కసరత్తు చేస్తున్నామని, కనీసం 10 లక్షల మందికి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు.వయోపరిమితి, విద్యార్హత ఎలా ఉండాలనే దానిపై చర్చిస్తున్నామని మంత్రి చెప్పారు. కేవలం భృతి ఇవ్వడమే కాకుండా యువతకు స్కిల్ ట్రైనింగ్ ఇస్తామన్నారు. దీని పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బడ్జెట్ కేటాయింపులతో పాటు ఇతర శాఖల నిధులు కూడా తీసుకుంటామన్న మంత్రి కొల్లు రవీంద్ర ఇతర రాష్ట్రాల మాదిరిగా పథకం ఫెయిల్ కాకుండా చూస్తున్నామని చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?