వీలైనంత త్వరగా నిరుద్యోగ భృతి అమలు: మంత్రి కొల్లు
- May 03, 2018
అమరావతి: నిరుద్యోగ భృతిని వీలైనంత త్వరలు అమలు చేయాలని సీఎం యోచిస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గురువారం నిరుద్యోగ భృతిపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. అనంతరం మంత్రి కొల్లురవీంద్ర మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగ భృతిపై విధివిధానాలు కసరత్తు చేస్తున్నామని, కనీసం 10 లక్షల మందికి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు.వయోపరిమితి, విద్యార్హత ఎలా ఉండాలనే దానిపై చర్చిస్తున్నామని మంత్రి చెప్పారు. కేవలం భృతి ఇవ్వడమే కాకుండా యువతకు స్కిల్ ట్రైనింగ్ ఇస్తామన్నారు. దీని పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బడ్జెట్ కేటాయింపులతో పాటు ఇతర శాఖల నిధులు కూడా తీసుకుంటామన్న మంత్రి కొల్లు రవీంద్ర ఇతర రాష్ట్రాల మాదిరిగా పథకం ఫెయిల్ కాకుండా చూస్తున్నామని చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







