హైదరాబాద్:ప్రముఖ నటుడి వస్త్ర దుకాణంలో చోరీ
- May 19, 2018సినీ నటుడు ఉత్తేజ్ నిర్వహిస్తున్న వస్త్ర దుకాణంలో చోరీ జరిగింది. ముగ్గురు మహిళలు దృష్టి మరల్చి ఖరీదైన మూడు చీరలను తీసుకొని పారిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నటుడు ఉత్తేజ్కు ఎల్లారెడ్డిగూడలో అలంకార్ డిజైనర్స్ పేరుతో వస్ర్తాల దుకాణం ఉంది. దీన్ని ఆయన సతీమణి పద్మావతి నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం ముగ్గురు మహిళలు షాపులోకి వచ్చారు. చీరలను చూస్తునట్టు నటించి, పద్మావతి దృష్టి మరల్చి మూడు చీరలను తీసుకొని పారిపోయారు. వీటి విలువ సుమారు రూ.80 వేలు ఉంటుందని ఉత్తేజ్ సంజీవరెడ్డినగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు