29నుంచి విదేశాల్లో గోపీచంద్ మూవీ పంతం షూటింగ్..
- May 26, 2018గోపీచంద్, మెహరీన్ నాయకానాయికలుగా తెరకెక్కుతున్న చిత్రం పంతం. దీనికి ఫర్ ఎ కాస్ అన్నది ఉపశీర్షిక. లోగడ బలుపు, పవర్, జై లవకుశ వంటి చిత్రాలకు స్క్రీన్ప్లే అందించిన కె.చక్రవర్తి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.. ఈ మూవీ జులై 5వ తేదిన ప్రేక్షకుల ముందుకురానుంది..ప్రస్తుతం ఈ మూవీ క్లైమాక్స్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో కొనసాగుతున్నది.. ఇక మరో షెడ్యూల్ స్కాట్లాండ్, లండన్ లో జరగనుంది.. దీని కోసం ఈ నెల 29వ తేదిన చిత్ర యూనిట్ అక్కడకు బయలుదేరి వెళ్లనుంది.. అక్కడు మూడు సాంగ్స్ తో పాటు కీలక సన్నీవేశాలు చిత్రీకరించనున్నారు.. ఈ షెడ్యూల్ తో టాకీ పార్ట్ పూర్తి అవుతుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించి మూవీని విడుదలకు సిద్ధం చేస్తారు.. గోపీసుందర్ సంగీతం, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు