యూఏఈ వీసా ఆన్ అరైవల్: ఇండియన్స్కి అర్హత ఎలాగంటే..
- June 13, 2018దుబాయ్ రెసిడెన్సీ అథారిటీ, యూఏఈ వీసా ఆన్ అరైవల్ పొందేందుకు ఇండియన్స్ ఏం చేయాలో వివరిస్తూ ఓ వీడియో విడుదల చేసింది. ఈద్ అల్ ఫితర్ దగ్గరవుతున్న నేపథ్యంలో చివరి నిమిషంలో యూఏఈ రావాలనుకునే భారతీయులకు యూఏఈ వీసా ఆన్ అరైవల్కి సంబంధించి రిమైండర్ని జారీ చేసింది. యునైటెడ్ కింగ్డమ్ లేదా యూరోపియన్ కంట్రీస్కి సంబంధించిన రెసిడెన్సీ వీసా వున్నవారికి, అమెరికన్ వీసా లేదా గ్రీన్ కార్డ్ వున్నవారికి ఈ వీసా ఆన్ అరైవల్ వర్తిస్తుంది. అయితే రెసిడెన్సీ వీసాలు 6 నెలలకు పైబడి చెల్లుబాటయ్యేలా వుడాలి. ఎంట్రీ పర్మిషన్ కోసం 100 దిర్హామ్ల రుసుముని, అలాగే 20 దిర్హామ్లు సర్వీసు ఫీ ఛార్జ్గానూ చెల్లించాల్సి వుంటుంది. ఇలా వీసా ఆన్ అరైవల్ పొందేవారికి అత్యధికంగా 14 రోజులపాటు యూఏఈలో స్టే చేసే అవకాశం వుంది. దీన్ని మరోసారి పొడిగించుకునేందుకూ అవకాశం వుంది. దీనికోసం 250 దిర్హామ్ల రెన్యువల్ ఫీజు, 20 దిర్హామ్ల సర్వీసు ఫీజు చెల్లించాలి. ఎక్స్టెన్షన్ పొందేవారికి 28 రోజులు స్టే చేసే అవకాశం లభిస్తుంది. ఓవర్ స్టేయింగ్కి (ఒక రోజుకి) 100 దిర్హామ్ల జరీమానా తప్పదు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు