ఈ నెల 24న చికాగో సెక్స్ రాకెట్ పై 'మా' మీటింగ్
- June 16, 2018యుఎస్ లో టాలీవుడ్ హీరోయిన్స్ సెక్స్ రాకెట్'తో 'మా' అలర్ట్ అయినట్టు కనిపిస్తోంది. చికాగో సెక్స్ రాకెట్ లో నిర్మాత కిషన్ మోదుగుముడి దంపతులని అక్కడి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రాకెట్ లో టాలీవుడ్ కు చెందిన టాప్ హీరోయిన్స్ ఉన్నట్టు చెబుతున్నారు. ఆ పేర్లు బయటికొస్తే టాలీవుడ్ షేక్ అవ్వడం ఖాయమని చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని పేర్లు లీకయ్యాయని తెలుస్తోంది.
ఈ వ్యవహారంతో ఉలిక్కిపడ్డ మా అసోసియేషన్ జూన్ 24 సమావేశం కానున్నట్లు ప్రకటించింది. ఈ సమావేశంలో ఏం చర్చించబోతున్నారు. ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. ఈ వ్యవహారంపై నటి శ్రీరెడ్డి, యాంకర్ అనసూయలు స్పందించారు. గతంలో అమెరికా దంపతులు తమని కూడా సంప్రదించారని తెలిపారు.
కొన్ని సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించిన కిషన్ మోదుగుముడి అలియాస్ రాజు అలియాస్ శ్రీరాజు, అతని భార్య చంద్రలు టాలీవుడ్కు చెందిన నటీమణులను తాత్కాలిక వీసా మీద అమెరికాకు తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులు అభియోగాలు నమోదుచేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్