ఇథియోపియా:ప్రధాని ర్యాలీలో భారీ పేలుడు...
- June 23, 2018అడిస్ అబబా: ఇథియోపియా నూతన ప్రధాని అబే అహ్మద్ నిర్వహించిన ర్యాలీలో భారీ పేలుడు చోటుచేసుకున్నది. అడిస్ అబబాలో జరిగిన ర్యాలీకి వేలాది మంది హాజరయ్యారు. ఆ సభలో పేలుడు జరగడంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు. ప్రసంగం పూర్తి కాగానే ప్రధాని అబే అహ్మద్ను సెక్యూర్టీ దళాలు సురక్షిత ప్రాంతానికి తరలించాయి. పేలుడులో అనేక మంది గాయపడినట్లు స్థానిక మీడియా ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మాజీ ప్రధాని హెయిలిమరియమ్ డిసలేన్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. దీంతో ఆయనకు వారసుడిగా అబే అహ్మద్ ఆ బాధ్యతలు స్వీకరించారు. దేశంలోని ఒరోమో తెగకు చెందిన మొదటి నేతగా అబే అహ్మద్ను గుర్తిస్తున్నారు. ఇథియోపియాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, రాజకీయ రెబల్స్ను వేధిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ర్యాలీలో జరిగిన పేలుడులో పలువురు చనిపోయినట్లు ఆ తర్వాత ప్రధాని ఓ ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..