ట్విట్టర్ షాక్ తగిలిన తారలు
- July 14, 2018ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్.. ఇలా సోషల్ మీడియాలో తమతమ అకౌంట్లకు ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో ఘనంగా చెప్పుకునే రోజులివి. సినీ స్టార్ల విషయానికొస్తే దీనికి మరింత ప్రాముఖ్యత. అయితే, ఈ విషయంలో బాలీవుడ్ స్టార్ నటీనటులకు తాజాగా పెద్ద షాకే ఇచ్చింది ట్విట్టర్ సంస్థ. ప్రముఖ నటులు అమితాబ్, షారూఖ్, ప్రియాంక చోప్ర, దీపిక పదుకునే వంటి సినీ స్టార్స్ ఫాలోవర్స్ ను భారీగా తగ్గించింది.
ఇటీవల ట్విట్టర్ సంస్థ నకిలీ అకౌంట్లపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. తప్పుడు వివరాలతో అకౌంట్ రన్ చేస్తోన్న ఖాతాదారుల్ని ఏరిపారేస్తోంది. ఇందులో భాగంగా చాలామంది ఖాతాలు గల్లంతయ్యాయి. సినీ స్టార్స్ ను ఫాలో అయ్యే ఇలాంటి నకిలీ గాళ్లంతా పోవడంతో ఆమేరకు ఆయా నటీనటుల ఫాలోవర్ల సంఖ్య తగ్గిపోయింది. ఇలా భారీగా కోతకు గురైన వాళ్లలో అమితాబ్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, మూడు లక్షల పైచిలుకు ఫాలోవర్లు కోల్పోయిన వాళ్లలో షారూఖ్, ప్రియాంకచోప్రా, దీపికా పదుకునే తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..