ప్రముఖ నటుడు కెప్టెన్ రాజు మృతి
- September 16, 2018కొచ్చి: ప్రముఖ నటుడు, దర్శకుడు కెప్టెన్ రాజు(68) కన్నుమూశారు. సోమవారం తెల్లవారుజామున కొచ్చిలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. ఈరోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1981లో వచ్చిన 'రక్తం' చిత్రంతో రాజు తెరంగేట్రం చేశారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఆయన దాదాపు 500 చిత్రాల్లో నటించారు. ఆయన కొంతకాలం ఆర్మీలోనూ పనిచేయడంతో అందరూ 'కెప్టెన్' అని పిలుస్తుండేవారు. తెలుగులో వెంకటేశ్ నటించిన శత్రువు సినిమాలో విలన్గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.
ఆయన ఆఖరిగా 2017లో వచ్చిన 'మాస్టర్పీస్' అనే చిత్రంలో నటించారు. జులైలో రాజు తన కుమారుడి పెళ్లి నిమిత్తం అమెరికాకు వెళుతుండగా విమానంలో గుండెపోటు వచ్చింది. దాంతో విమానాన్ని ఒమన్లోని మస్కట్కు మళ్లించి అక్కడి నుంచి కొచ్చికి తరలించారు. రాజుకు భార్య ప్రమీల, కుమారుడు రవి ఉన్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..