అభ్యర్థులెవరూ హైదరాబాదులో కనపడొద్దు:కేసీఆర్
- October 21, 2018అభ్యర్థులెవరూ హైదరాబాదులో కనపడొద్దని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరించారు. ఇప్పటికే ప్రకటించిన 105 మంది అభ్యర్థులు, ఎంపీలతో 3 గంటలకు పైగా కొనసాగిన సమావేశంలో ప్రచార వ్యూహంపై మార్గనిర్దేశం చేశారు. ప్రతిపక్షాల మేనిఫెస్టోను కాపీ కొట్టామన్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని కేసీఆర్ సూచించారు. 10, 15 చోట్ల ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయంటూ సర్వే రిపోర్టులను చూపించారు. ప్రతి నియోజకవర్గంలోను అభ్యర్థుల బలాబలాలను ఆయన విడివిడిగా చర్చించారు. అభ్యర్థుల పరిస్థితిని సమీక్షించారు. గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్న అభ్యర్థులను కేసీఆర్ హెచ్చరించారు. ఈ 40 రోజుల పాటు అభ్యర్థులెవరూ హైదరాబాదులో కనిపించడానికి వీల్లేదని, నియోజకవర్గాల్లో ప్రచారాన్ని తీవ్రతరం చేయాలని హుకుం జారీ చేశారు.
కేసీఆర్ మరోసారి సీఎం కావడం చారిత్రక అవసరమన్నారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. టీఆర్ఎస్ లో అసమ్మతి సద్దుమణిగిందన్నారు. 100 సీట్లలో గెలిచి చరిత్ర సృష్టించడమే లక్ష్యమని తెలిపారు. తెలంగాణపై టీఆర్ఎస్ కు ఉన్న బాధ మరో పార్టీకి లేదన్నారు కడియం. మహాకూటమి తమకు పోటీయే కాదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..