యూఏఈలో అంగరంగ వైభవంగా దీపావళి వేడుకలు
- November 07, 2018యూఏఈ అంతటా దీపావళి పండుగ సందర్భంగా వెలుగులు విరజిమ్మాయి. యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దీపావళి వేడుకల కోసం రెసిడెంట్స్కి పిలుపునిచ్చారు. అలాగే షేక్ మొహ్మద్ హిందీలోనూ, ఇంగ్లీషులోనూ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. యూఏఈ ప్రజల తరఫున భారత ప్రధాని నరేంద్రమోడీకీ, భారత ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెబుతున్నట్లు పేర్కొన్నారు షేక్ మొహమ్మద్. దీపావళి ఫొటోల్ని, వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేయాలని కూడా షేక్ మొహమ్మద్ పిలుపునిచ్చారు. ఇదిలా వుంటే, షేక్ మొహమ్మద్ శుభాకాంక్షల పట్ల స్పందించిన భారత ప్రధాని నరేంద్రమోడీ, అరబిక్ అలాగే ఇంగ్లీషులలో కృతజ్ఞతలు తెలిపారు. కాగా, దుబాయ్ అంతటా దీపావళి సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరిగాయి. దీప కాంతులతో దుబాయ్ వెలిగిపోయింది. రంగోలీ డిజైన్స్, దీపాల అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎంపిక చేసిన ప్రత్యేక ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఫైర్ వర్క్ షో నిర్వహించగా, వీటిని తిలకించేందుకు పెద్దయెత్తున సందర్శకులు పోటెత్తారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్