ఉద్యోగులకు గుడ్ న్యూస్..!
- November 13, 2018దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ వర్గాన్ని మచ్చిక చేసుకునే వ్యూహాలు రచిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆకట్టుకునే ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఓ కొత్త అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. సాధారణంగా ప్రభుత్వ సంస్థల్లో కానీ ప్రయివేటు సంస్థల్లో కానీ పని చేసే ఉద్యోగులకు ప్రతి ఐదేళ్లకొకసారి నిర్దేశిత భత్యాన్ని గ్రాట్యుటీగా పొందే అవకాశం ఉండేది ఇప్పటి వరకు.
అయితే ఈ అవకాశం సంస్థలు ఉద్యోగులందరికీ కల్పించడం లేదన్నది వాస్తవం. సుదీర్ఘకాలం సర్వీసులో ఉన్నవారికి మాత్రమే లబ్ది చేకూరుతున్నదని ఉద్యోగ సంఘాలనుంచి నిరసన వ్యక్తమవుతోంది. అయితే ఇదే అవకాశంగా భావించిన మోదీ సర్కార్.. గ్రాట్యుటీ పీరియడ్ని మూడేళ్లకు కుదించేలా.. పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ-1972 చట్టాన్ని సవరించడానికి ప్రయత్నిస్తోంది. కాంట్రాక్ట్ బేస్లో తీసుకున్న ఉద్యోగులకు కూడా ఈ తాజా సడలింపు వర్తించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి పారిశ్రామిక వర్గాల నుంచి సూచనలు, సలహాలను స్వీకరిస్తోంది లేబర్ మినిస్ట్రీ. డిసెంబర్ నెలాఖరుకు ఈ నిర్ణయం పట్ల స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..