యూఏఈ విడిచి పెడితే, 6 నెలల వీసా చెల్లదు
- November 13, 2018ప్రస్తుతం నడుస్తోన్న అమ్నెస్టీ స్కీమ్ ద్వారా ఆరు నెలల వీసా పొందినవారు, యూఏఈ విడిచి వెళితే ఆ వీసా ఆ తర్వాత చెల్లుబాటు కాదని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ నేషనాలిటీ పేర్కొంది. రెసిడెన్స్ వీసాతో పోల్చితే, ఆరు నెలల వీసాకి ఎలాంటి హక్కులూ వుండవు. ఆరు నెలల సమయంలో ఉద్యోగం చూసుకోగలిగితే తప్ప, ఈ వీసాతో అదనపు ప్రయోజనాలు ఏమీ వుండవని అధికారులు పేర్కొన్నారు. ఈ వీసా మల్టిపుల్ ఎంట్రీకి పనికిరాదని ఎఫ్ఎఐసి అధికారి ఒకరు స్పష్టతనిచ్చారు. 600 దిర్హామ్లకు ఆరు నెలల తాత్కాలిక వీసా, అమ్నెస్టీ పొందగోరేవారికి లభిస్తుంది. తమ పెండింగ్ ఫైన్స్ని క్లియర్ చేసుకున్నవారికే ఈ వీసా వెసులుబాటు లభిస్తుంది. ఆరు నెలల్లో ఉద్యోగం వెతుక్కోగలిగేవారికే ఈ టెంపరరీ వీసా ఉపయోగపడ్తుందనీ, లేని పక్షంలో దేశం విడిచి వెళ్ళాల్సి వుంటుందనీ, ఓ సారి దేశం విడిచి వెళితే వీసా మళ్ళీ పనిచేయదని ఎఫ్ఎఐసి డైరెక్టర్ ఆఫ్ రెసిడెన్స్ ఎఫైర్స్ బ్రిగేడియర్ సయీద్ రక్యాన్ అల్ రషీద్ చెప్పారు. టెంపరరీ వీసాతో ఎలాంటి పనీ చేయడానికి వీల్లేదు. ఉద్యోగం పొందిన తర్వాత, ఎంప్లాయ్మెంట్ వీసా పొందిన తర్వాతే వర్క్ చేయడానికి వీరు అర్హులు. అమ్నెస్టీ స్కీమ్ నవంబర్ 30వ తేదీతో ముగుస్తుంది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్