విజయవాడ నుంచి సింగపూర్ ఎగిరిపోవచ్చు
- November 20, 2018ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది శుభవార్తే. సింగపూర్ వెళ్లాలనుకునే వారు ఇకపై హైదరాబాద్కో, చెన్నైకో వెళ్లాల్సిన పనిలేదు. ఇప్పుడు నేరుగా విజయవాడ నుంచి సింగపూర్ ఎగిరిపోవచ్చు. ఈ మేరకు బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో అంతర్జాతీయ విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇండిగో ఎయిర్లైన్స్తో రాష్ట్ర ఇంధన, మౌలిక సదుపాయలు, సీఆర్డీఏ చేసుకున్న అవగాహనా ఒప్పందంలో భాగంగా సింగపూర్కు నేరుగా విమానాలు నడపనుంది. డిసెంబరు 4 నుంచి విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని ఇండిగో ఆహ్వానించింది.
తాజా వార్తలు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం