ఆఫ్ఘనిస్థాన్లో ఘోర ప్రమాదం
- January 06, 2019కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర బదాఖ్షాన్ ప్రావిన్స్లోని ఓ బంగారం గని కూలడంతో 30 మంది కార్మికులు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. వీళ్లంతా గనిలో పని చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో 20 మంది వరకు గాయపడినట్లు పోలీసులు చెప్పారు. ఈ ప్రాంతంలో ఇలా గనులు కూలడం తరచుగా జరుగుతూనే ఉంటాయి. స్థానిక గ్రామస్థులు బంగారం కోసమని నదీ తీరంలో 60 మీటర్ల లోతు వరకు గని తవ్వారు. అందులోకి వెళ్లి బంగారం కోసం అన్వేషిస్తుండగా గని కూలింది. ఈ గనిని తవ్విన వాళ్లు ప్రొఫెషనల్స్ కాకపోవడం వల్ల అది కూలి ఉంటుందని ప్రావిన్స్ గవర్నర్ ప్రతినిధి నిక్ మొహ్మద్ నజారీ చెప్పారు. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో ఇక్కడి గ్రామస్థులు కొన్ని దశాబ్దాలుగా ఇలా అక్రమంగా గనులు తవ్వి బంగారం కోసం అన్వేషిస్తున్నారని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..