భారతదేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది--వెంకయ్యనాయుడు
- January 12, 2019భారతదేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది అన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే యువత పోటీ తత్వాన్ని అలవరచుకోవాలని వెంకయ్యనాయుడు యువతకు దిశానిర్ధేశం చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ స్వర్ణభారత్ ట్రస్టు దగ్గర జరిగిన స్వామి వివేకానంద ఉత్సవాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రస్తుతం దేశం పెను సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి యువత పోటీ తత్వాన్ని అలవరచుకోవాలని సూచించారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని 120 ఏళ్ల కిందటే స్వామి వివేకనంద స్వామి అభిప్రాయపడ్డారని గుర్తు చేశారు..
స్వర్ణభారత్ ట్రస్ట్ విద్యార్థులతో ముఖాముఖిలో వెంకయ్యనాయుడు కాసేపు మాట్లాడారు. విద్యార్థులకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అక్కడి క్యాంటీన్ను స్వయంగా పరిశీలించి భోజన వసతిపై ఆరా తీశారు..
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?