మమ్ముట్టితో తొలిసారి సన్నీలియోన్
- January 29, 2019హాట్ బ్యూటీ సన్నీలియోన్ బాలీవుడ్ కంటే సౌత్పై ఎక్కువగా ఫోకస్ చేసిందా? అవుననే అంటున్నారు కొంతమంది ప్రొడ్యూసర్లు. మోలీవుడ్లో ఈమెకున్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఇటీవల ఓ మొబైల్ షాపు ఓపెనింగ్కి కేరళకు వెళ్లిన సన్నీని చూసేందుకు యూత్ ఓ రేంజ్లో ఎగబడింది. దీన్ని గమనించిన కొందరు ప్రొడ్యూసర్లు.. ఆమె క్రేజ్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని ఆలోచన చేశారు. ఈ నేపథ్యంలో మమ్ముట్టితో 'మధుర రాజా' సినిమా మొదలుపెట్టేశారు. షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.
ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సన్నీలియోన్ స్పెషల్సాంగ్ చేస్తోంది. మమ్ముటితో కలిసి తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోనుంది సన్నీ. ఈ సాంగ్ మూవీకే హైలైట్ అని చెబుతోంది యూనిట్. అందుకు సంబంధించిన పిక్ సోషల్మీడియాలో వైరల్గా మారింది.
షెడ్యూల్ ప్రకారం ఈ ఫిల్మ్ని ఏప్రిల్లో రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ప్లాన్. వైశాఖ్ డైరెక్ట్ చేస్తున్న ఫిల్మ్లో తమిళ నటుడు జై, జగపతిబాబు కీలకపాత్ర పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..