సాహో లేటెస్ట్ అప్డేట్
- February 05, 2019యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - శ్రద్ద కపూర్ జంటగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం సాహో. ఈ సినిమా సెట్స్ మీద ఉందనే కానీ ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్ డేట్స్ లేకపోయేసరికి అభిమానులు ఈ సినిమా ఏం జరుగుతుందో తెలియక తికమక పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ నుండి ఓ వార్త బయటకు వచ్చింది.
యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ 50 శాతం పూర్తి అయ్యిందట. ఇండియాలోనే భారీ విజువల్స్ తో ఈ సినిమా రాబోతుందని , మే నెలకల్లా చిత్రం యొక్క పూర్తి వర్క్ పూర్తి చేయబోతారని , జూలై నుండి ప్రమోషన్స్ ను మొదలు పెట్టి ఆగష్టు 15న సినిమాను గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.
తెలుగు, హిందీ, తమిళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రానికి 'రన్ రాజా రన్' ఫేమ్ సుజీత్ డైరెక్ట్ చేస్తుండగా, యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..