నటి ఝాన్సీ ఆత్మహత్యకు కారణం చెప్పిన సూర్య
- February 11, 2019సంచలనం రేపిన బుల్లితెర నటి నాగఝాన్సీ ఆత్మహత్య కేసులో కొత్త కొణాలు వెలుగులోకి వస్తున్నారు. ఆమె ప్రియుడు సూర్యతేజను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో కొత్త విషయాలను బయటపెట్టాడు సూర్య. ఝాన్సీకి బాబీ , గిరిలు ఫొటో షూట్ చేసేవారిని వారి నమ్మొద్దని పలుమార్లు చెప్పినట్లు తెలిపాడు. గిరి సినిమా ఛాన్స్ పేరుతో ఝాన్సీని మోసం చేశాడని విచారణలో పేర్కొన్నాడు. సినీ ఆఫర్లు లేకే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. ఝాన్సీ విషయంలో ఒకసారి గిరికి కూడా వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపాడు సూర్య. దీంతో బాబీ, గిరిని కూడా పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు…
మరో వైపు తన కూతురు ఆత్మహత్యకు సూర్యతేజనే కారణమని, అతడిని కఠినంగా శిక్షించాలని ఝాన్సీ తల్లి సంపూర్ణ, సోదరుడు దుర్గాప్రసాద్ పోలీసులను కోరారు. ఝాన్సీ ఇంట్లోనూ పంజాగుట్ట పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆమె డైరీని స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. సూర్య ఇదివరకే మధు అనే సీరియల్ నటితో ప్రేమ వ్యవహారం నడిపాడని, ఆ తర్వాత మధుకు బ్రేకప్ చెప్పిన సూర్య, ఝాన్సీని ప్రేమించినట్లు తెలుస్తోంది..
మధు సహాయంతోనే అతడు ఝాన్సీని ట్రాప్ చేశాడని సమాచారం. సూర్య పుట్టిన రోజు కానుకగా రెండు లక్షలు విలువ చేసే బైక్ను ఝాన్సీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత 10 లక్షల రూపాయలు విలువచేసే బంగారు నగలను సైతం అతడికి ఇచ్చినట్లు సమాచారం. కేసుకు సంబంధించి మృతురాలి తల్లి, సోదరుని వాంగ్మూలాన్నీ నమోదు చేసినట్లు ఏసీపీ వివరించారు.
తాజా వార్తలు
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు