ఇంటలీజెన్స్ నుండి హెచ్చరిక..మరో దాడికి అవకాశం..
- February 21, 2019న్యూఢిల్లీ: పుల్వామాలాంటి దాడులు మరిన్ని చేయడానికి జైషే మహ్మద్ ప్లాన్ వేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. తాన్జీమ్ అనే ఓ చిన్న ఉగ్రవాద గ్రూపు ద్వారా ఈ సమాచారం వెల్లడైంది. జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాల కాన్వాయ్లు లక్ష్యంగా ఈ దాడులు జరగనున్నట్లు హెచ్చరించాయి. ఈసారి చౌకీబల్, తాంగ్ధర్ రూట్లలో ఈ దాడులు జరగనున్నట్లు ఏజెన్సీలు గుర్తించాయి. ఈ రూట్లలో ఐఈడీ దాడులు జరిగే ప్రమాదం ఉన్నట్లు అంచనా వేస్తున్నాయి. దీనికోసం తాన్జీమ్ ఓ ఆకుపచ్చ రంగు స్కార్పియోను సిద్ధం చేసిందని, దాని ద్వారా ఆత్మాహుతి దాడి జరిగే ప్రమాదం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. జైషే మహ్మద్కు చెందిన ఓ సోషల్ మీడియా గ్రూప్లోని కోడ్ను నిఘా వర్గాలు ఛేదించాయి. పుల్వామాలో 300 కిలోల ఆర్డీఎక్స్తో జరిగిన దాడి ఓ ఆటబొమ్మలాంటిదని, 500 కిలోల పేలుడుకు సిద్ధంగా ఉండండి అని ఆ సందేశంలో రాసి ఉండటం గమనార్హం. కాశ్మీరీలను లక్ష్యంగా చేసుకోవడం భద్రతా బలగాలు మానుకోవాలని ఆ ఉగ్రవాద గ్రూపులు హెచ్చరించాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని కూడా చెప్పడం విశేషం. ఈ సందేశం నేపథ్యంలో సరిహద్దులో చొరబాట్లు కూడా పెరిగే ప్రమాదం ఉన్నట్లు ఆందోళన వ్యక్తమవుతున్నది. గురెజ్ ప్రాంతంలో వివిధ చోట్ల నుంచి ఐదారుగురు ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్