స్మగ్లింగ్ - ఒమన్లో 10 మంది అరెస్ట్
- February 21, 2019మస్కట్: పది మంది వలసదారులు స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. డీజిల్, నార్కోటిక్ సబ్స్టాన్సెస్ని స్మగుల్ చేస్తున్నట్లుగా వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. ముసాందామ్ మరియు సలాలాలోని తీర ప్రాంతాల్లో నిందితులు స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దోఫార్ కోస్ట్ గార్డ్ పెట్రోల్స్, పోర్ట్ ఆఫ్ సలాలా దగ్గరలో ఫిషింగ్ బోట్లో ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారనీ, వారి నుంచి కొంత మొత్తంలో ఖత్ని స్వాధీనం చేసుకున్నారనీ రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. నిందితుల వద్ద 2200 ప్యాకెట్ల ఖత్ లభ్యమయ్యింది. ముసాందామ్ గవర్నరేట్లో కోస్ట్ గార్డ్ నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసింది. వీరంతా ఆసియా జాతీయులే. డీజిల్ని బోట్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నట్లు వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. మరో కేసులో కోస్ట్గార్డ్ పెట్రోల్ - కుమ్జార్, ముగ్గురు వ్యక్తుల్ని తీసుకెళుతున్న బోట్ని సీజ్ చేశారు. అందులో వున్న ముగ్గురు వ్యక్తులు ఆసియాకి చెందినవారే.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..