మెక్సికో:నైట్క్లబ్ కాల్పుల్లో 15 మంది మృతి
- March 10, 2019మెక్సికో: మెక్సికోలోని ఓ నైట్క్లబ్లో జరిగిన కాల్పుల్లో 15 మంది మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. గ్వానాజువాటో రాష్ట్రంలోని సలమాంకాలో ఉన్న నైట్క్లబ్లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. సలమాంకాలో రాష్ట్ర ఇంధన కంపెనీ పెట్రోలియస్ మెక్సికనోస్కు చెందిన మెయిన్ పైప్లైన్ ఉన్నది. ఈ పైప్లైన్ నుంచి కొందరు దుండగులు గత ఐదేండ్ల నుంచి భారీగా ఇంధన చోరీకి పాల్పడుతున్నారు. వీరిని పట్టుకోవడానికి పోలీసులు శనివారం గాలింపు చేపట్టారు. ఇదే సమయంలో నైట్క్లబ్లో కాల్పులు జరిగాయి. పోలీసులు మాట్లాడుతూ భారీగా ఆయుధాలు కలిగిన దుండగులు కాల్పులకు తెగబడటంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారని, నలుగురు గాయపడ్డారని తెలిపారు. దొంగలు ఐదేండ్ల కాలంలో రూ.21000 కోట్ల విలువైన ఇంధనాన్ని చోరీ చేశారని వివరించారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు