షార్జా ఛారిటీ ఇంటర్నేషనల్: 41 మిలియన్ దిర్హామ్ల రమదాన్ సాయం
- April 22, 2019షార్జాలోని ఓ ఛారిటీ 41 మిలియన్ దిర్హామ్ల ఛారిటీ క్యాంపెయిన్ని ఈ ఏడాది రమదాన్ కోసం కేటాయించింది. తద్వారా అవసరమైనవారికి దేశంలోనూ, అలాగే విదేశాల్లోనూ రమదాన్ సాయం అందిచనున్నామని నిర్వాహకులు తెలిపారు. షార్జా ఛారిటీ ఇంటర్నేషనల్ సెక్రెటరీ జనరల్ అబ్దుల్లా అల్ దుకాన్ మాట్లాడుతూ, పవిత్ర రమదాన్ మాసం కోసం ఐదు ఛారిటబుల్ ప్రాజెక్ట్లకు మద్దతిస్తున్నట్లు తెలిపారు. 2 మిలియన్ దిర్హామ్ల విలువైన మీల్స్ని 3,000 కుటుంబాలకు అందించడం ఇందులో మొదటిది. 1 మిలియన్ ఇఫ్తార్ మీల్స్ని 148 ప్రాంతాల్లో (యూఏఈ), 56 దేశాల్లో 200,000 మీల్స్ అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జకాత్ అకౌంట్ ద్వారా 15 మిలియన్ దిర్హామ్లను వినియోగిస్తారు. పవిత్ర రమదాన్ మాసం ముగిశాక జకత్ అల్ ఫితర్ డిస్ట్రిబ్యూషన్ కోసం 2 మిలియన్ దిర్హామ్లను కేటాయిస్తున్నారు. పెద్దయెత్తున మంచి మనసున్నవారి నుంచి అందుతున్న నిధులతో ఇవన్నీ చేయగలుగుతున్నట్లు అల్ దుఖాన్ చెప్పారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..