120,000 అక్రమ వలసదారుల కోసం వేట
- April 29, 2019కువైట్:దేశంలో 120,000 మంది వలసదారులు అక్రమంగా నివసిస్తున్నారనే అంచనాలతో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ఆయా వ్యక్తుల జాడ కనుగొనేందుకు సంబంధిత శాఖల ద్వారా 'వేట' కొనసాగిస్తోంది. ఉల్లంఘనుల్లో కొందరు తమ రెసిడెన్స్ పర్మిట్ని వివిధ కారణాలతో రెన్యూ చేసుకోలేకపోయినట్లు మినిస్ట్రీ భావిస్తోంది. అలాగే మరికొందరు విజిట్ వీసాలపై వచ్చి, ఆ తర్వాత గడువు తీరినా దేశం విడిచి వెళ్ళకుండా వుండిపోయినట్లు పేర్కొంటున్నారు అధికారులు. అయితే, ఏ కారణాలతో అయినా అక్రమ నివాసితులుగా వున్నవారిని అరెస్ట్ చేయడం తప్పనిసరి అని మినిస్ట్రీ చెబుతోంది. కాగా, డిపార్ట్మెంట్ ఆఫ్ డిపోర్టేషన్ గత కొద్ది రోజుల్లో 620 మంది వలసదారుల్ని డిపోర్ట్ చేయడం జరిగింది. వీరిలో 18 మంది మహిళలు వున్నారు. డిపోర్టేషన్ సెంటర్ కెపాసిటీ 800 మంది మాత్రమే.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?