బ్రెజిల్:బార్లో కాల్పులు 11 మంది మృతి
- May 20, 2019బెలెమ్: బ్రెజిల్లోని పారా రాష్ట్రం కాల్పుల మోతతో దద్దరిల్లింది. బెలెమ్ నగరంలోని ఓ బార్లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకరాం..కార్లు, బైక్లపై వచ్చిన ఏడుగురు సాయుధ దుండగులు బార్లోకి ప్రవేశించి అక్కడి వారిపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఘటన అనంతరం దుండగులు పారిపోతుండగా పోలీసులు వారిని వెంబడించారు. ఓ నిందితుడిని పట్టుకోగా.. మిగిలినవారు పరారయ్యారు. కాల్పుల్లో ఆరుగురు మహిళలు, ఐదుగురు పురుషులు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ దాడి వెనుక కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..