రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ళ చిన్నారి మృతి
- May 24, 2019బహ్రెయిన్:దార్ కులైబ్ విలేజ్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం నాలుగేళ్ళ చిన్నారిని బలి తీసుకుంది. హమాద్ టౌన్ దగ్గరలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతి చెందిన చిన్నారిని రీమ్ హుస్సైన్ అల్ అరాదిగా గుర్తించారు. ఓ ఫ్లవర్ షాప్ వద్ద అతి వేగంగా దూసుకొచ్చిన కారు చిన్నారిని ఢీకొంది. విలేజ్ ప్రారంభంలో తన తండ్రికి చెందిన ఓ ఫ్లవర్ షాప్ వద్దకు చిన్నారి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన వాహనం, డ్రైవర్కి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. 'ఈ జీవితంలో నాకున్న ఒకే ఒక్క అతి ముఖ్యమైన వ్యక్తివి నువ్వు. నిన్ను నేను కోల్పోయాను. వింటున్నావా, నీ తండ్రి నిన్నెంతో ప్రేమిస్తున్నాడు' అని ఆ చిన్నారి తండ్రి తన కూతురి కోసం రాసిన అక్షరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, చాలామందికి కంటతడి పెట్టిస్తున్నాయి.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..