పదవతరగతి అర్హతతో నేవీలో ‘సెయిలర్’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
- July 22, 2019ఇండియన్ నేవీలో సెయిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. పదవతరగతి ఉత్తీర్ణులైన అవివాహిత పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.205 చెల్లించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు.
ఇండియన్ నేవీలో ఏప్రిల్-2020 బ్యాచ్కు సంబంధించి ‘సెయిలర్’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. పదోతరగతి ఉత్తీర్ణులైన అవివాహిత పురుష అభ్యర్థులు ఈ పోస్టుల వివరాలు..
400 పోస్టులు.. చెఫ్, స్టీవార్డ్, హైజినిస్ట్
అర్హత: పదవతరగతి ఉత్తీర్ణత.. నిర్గిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: 01.04.2000 – 31.03.2003 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.205. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించాలి. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా..
శిక్షణ: రాత పరీక్ష, ఇతర పరీక్షల ద్వారా ఎంపికైన అభ్యర్థులకు 2020 ఏప్రిల్లో 15 వారాల పాటు ఒడిశాలోని ఐఎన్ఎస్ చిల్కాలో శిక్షణ ఉంటుంది. ప్రొఫెషనల్ ట్రైనింగ్తో పాటు ఇతర నావికాదళ శిక్షణ కూడా ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు: ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 26.07.2019.. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01.08.2019.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..