పసిడి ధర పెరిగే అవకాశం!
- August 07, 2019అంతర్జాతీయంగా అమెరికా, చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధంతో పసిడి ధరలు ఒక్కసారిగా ఎగిసాయి. వాణిజ్య యుద్ధం నేపథ్యంలో మదుపరులు తమ సంపదను బంగారంపై పెట్టుబడి పెట్టడమే సురక్షితంగా భావిస్తున్నారు. దీంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి.అయితే భవిష్యత్తులో బంగారం ధర తగ్గుతుందా అంటే మాత్రం, సమీప భవిష్యత్తులో మాత్రం అవకాశం లేదనే చెప్పాలి. ఎందుకంటే, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులకే ఇందుకు కారణం, భవిష్యత్తులో బ్రెగ్జిట్ అంశం మార్కెట్లను కలవరపరచడం, దేశీయంగా డిమాండ్ పెరగడం, మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో బంగారం అంతకంతకు ధర పెరుగుతుందే తప్ప దిగే సూచనలు కనిపించడం లేదు. అలాగే రూపాయి మరింత బలపడే అవకాశాలు సైతం తక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో బంగారం ధరలు పెరగవచ్చని బులియన్ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరో ఆరు నెలల్లో బంగారం ఊహకు అందనంత రేంజిలో పెరిగిన ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. అయితే దీర్ఘకాలంలో అంతర్జాతీయ పరిస్థితులను కచ్చితంగా అంచనా వేయలేని నేపథ్యంలో బంగారం పెట్టుబడులపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ధరలో హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు తప్పకుండా ఫిజికల్ బంగారం కొనుగోలు చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు