హైదరాబాద్ మెట్రో రైల్ సరికొత్త రికార్డు సృష్టించింది
- August 15, 2019హైదరాబాద్ మెట్రో రైల్ మరో రికార్డు సృష్టించింది. బుధవారం ఒక్కరోజే మెట్రోలో 3 లక్షల 6 వేల మంది ప్రయాణం చేశారు. పెరుగుతున్న ట్రాఫిక్కి మెట్రోనే ప్రత్యమ్నాంగా కనిపిస్తుండడంతో.. నెమ్మదిగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అన్ని రూట్లలోనూ మెట్రో సేవల్ని మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. సేఫ్టీ క్లియరెన్స్ రాగానే అమీర్పేట – హైటెక్సిటీ రూట్లో 5 నిమిషాలకో సర్వీస్ ఉంటుందన్నారు. రద్దీ వేళల్లో ప్రతి 3 నిమిషాలకు ఒక మెట్రో రైలు తిరిగేలా చూస్తామన్నారు. రాయదుర్గం వరకూ మెట్రోను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని వివరించారు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?