మోదీపై ధ్వజమెత్తిన ఇమ్రాన్
- August 16, 2019పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్ పై తన అక్కసును వెళ్లగక్కారు. జమ్మూకశ్మీర్ విషయంలో ప్రధాని మోడి నేతృత్వంలోని హిందుత్వ మూకలు అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలు విఫలమవుతాయని ఆయన హెచ్చరించారు. ఈ ప్రపంచంలో సైన్యాలు, మిలిటెంట్లు, ఉగ్రవాదులను అంతకంటే బలమైన శక్తి అణచివేయగలదని చెప్పారు. కానీ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడే ప్రజలు చావుకు భయపడరని స్పష్టం చేశారు. ఈ ప్రపంచంలో ఏ శక్తీ వాళ్లను తమ లక్ష్యానికి చేరుకోకుండా అడ్డుకోలేదని అన్నారు. ఈ విషయాన్ని హిందుత్వ విధానాలకు వకల్తా పుచ్చుకున్న ఫాసిస్ట్ మోడి అర్థం చేసుకోవాలని సూచించారు. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్రం రాష్ట్రాన్ని లడఖ్, జమ్మూకశ్మీర్ అని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయంపైనే ఇమ్రాన్ తన అక్కసును మళ్లీ వెళ్లగక్కారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..