శివరాత్రి+మహిళా దినోత్సవం= పోతన పద్యం:-
- March 06, 2016మ్రింగెడివాడు విభుండని
మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగమనె సర్వమంగళ
మంగళసూత్రమ్మునెంత మది నమ్మినదో
నేడు శివరాత్రి. రేపు మహిళా దినోత్సవం. రెండింటి ప్రస్తావనికి సరిపోతుంది ఈ పోతన పద్యం అనిపించింది.
"మింగే వాడు భర్త అని, మింగేది విషమని తెలిసినా, లోకకళ్యాణం కోసం పార్వతి శివుడ్ని విషం మింగేయమంది. తన మంగళసూత్రంపై తనకు ఎంత నమ్మకమో". ఇదీ ఈ పద్యభావం.
అంటే విషం మింగే విషయంలో క్లారిటీ కోసం శివుడంతటివాడు కూడా తన భార్యను సంప్రదించాడు. ఎంతటి శక్తిమంతుడికైనా స్త్రీ సంప్రదింపు లేనిదే కొన్ని పనులు చేయలేడు. పోతన అలా శివపార్వతుల ఘట్టంతో చెప్పినా, పాశ్చాత్యులు "Behind every successful man, there is a woman" అని చెప్పినా ప్రపంచమంతా స్త్రీశక్తిని ఎప్పుడో గుర్తించింది.
-సిరాశ్రీ
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు