ఇఫ్తార్ విందుకు వెళ్తుండగా ప్రమాదం..ముగ్గురు యువకులు మృతి..!!
- March 19, 2025
యూఏఈ: మార్చి 17న సాయంత్రం వాడి అల్ హెలోలో జరిగిన విషాదకరమైన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఎమిరాటీ యువకులు ప్రాణాలు కోల్పోయారు. అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని, వాహనం అనేకసార్లు బోల్తా పడి లోయలో పడటంతో మంటలంటుకున్నాయని పోలీసులు తెలిపారు. మృతులంగా 15 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల వారని పేర్కొన్నారు. ఇఫ్తార్ విందుకు స్నేహితుడి ఇంటికి వెళుతుండగా ప్రమాదం జరిగిందని షార్జా పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా రమదాన్ సమయంలో ఇఫ్తార్కు ముందు చాలా మంది తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి వేగంగా వెళతారని, ముఖ్యంగా యువ డ్రైవర్లు రోడ్లపై జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!